ఎండి చేప ములక్కాడ పులుసు
కావలసినవి:
- చిన్న ఎండి చేపలు-7
- ములక్కాడలు -5
- ఉల్లిపాయలు-4 (పెద్దవి)
- పచ్చిమిర్చి-5
- టొమాటో-2
- చింత పండు-పులుపుకి సరిపడినంత
- కరివేపాకు-రెండు రోబ్బలు
- తాలింపు గింజలు -౧/2 టీ స్పూన్
- ఉప్పు-ఒక టీ స్పూన్
- కారం-ఒక టీ స్పూన్
తయారు చేసే విధానం:
- ఎండి చేపలను ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- ములక్కదాలను కడిగి కట్ చేసుకోవాలి.
- ఉల్లిపాయలు,పచ్చి మిర్చి,టొమాటో లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- చింత పండును కొద్దిగా నీటిలో నానబెట్టుకొని ఉంచాలి.
- ఇప్పుడు ఒక పాన్ తీసుకొని నూనె వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి.
- ఇప్పుడు కాగిన ఈ నూనెలో ఎండి చేపలను వేసి వేపుకోవాలి.బంగారు రంగు వచ్చాక ఈ చేపలను తీసి పక్కన పెట్టాలి.
- తర్వాత నూనెలో కొద్దిగా తాలింపు గింజలు కరివేపాకు వేసి వేపాలి.దీనికి
- కట్ చేసి ఉంచిన ఉల్లిపాయలు,పచ్చి మిర్చి ముక్కలను కూడా వేసి కలపాలి.
- ఇవి బాగా వేగాక టమోటో ముక్కలను వేసి వేయించి.,కట్ చేసిన ములక్కాడ ముక్కలను ఇందులో వేసి ఉప్పు,కారం వేసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి.
- ౩ నిముషాల తర్వాత బాగా కలిపి చింత పండు రాసాని దీనిలో పొయ్యాలి.
- ఇప్పుడు మొత్తాన్ని బాగా కలిపి ఒక 7 నిమిషాలు ఉడికించాలి.
- ఇప్పుడు నోరూరించే ఎండి చేప ములక్కాడ పులుసు రెడీ.
0 comments:
Post a Comment